ఉత్తర్‌ప్రదేశ్‌లో రెండు ఘోర ప్రమాదాలు

SMTV Desk 2017-07-06 13:13:21  uttarapradesh, two, accident, 14 death

లఖ్ నవూ, జూలై 06 : ఉత్తర ప్రదేశ్ లో రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఘోర ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... బిజ్నోర్ లో జరిగిన ప్రమాదంలో 9 మంది మృతి చెందారు, ఈ ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. అలాగే మరో ప్రమాదం సీతాపూర్ లోని లహార్ పూర్ ప్రాంతంలో జరిగింది. ఎదురెదురుగా వస్తున్న ట్రక్కు-కారు ఢీకొని ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారందరు ఒకే కుటుంబానికి చెందినవారని పోలీసులు తెలిపారు. సహాయక చర్యలు వేగవంతం చేశామని, గాయపడ్డ వారిని దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించి తగిన చికిత్స చేయిస్తున్నామని వారు వెల్లడించారు.