బెంగళూరు, ఏప్రిల్ 24 : కర్ణాటక ఎన్నికల సమరం ముందు కాంగ్రెస్ పార్టీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ నేత, నటుడు అంబరీష్ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. మండ్యా నుంచి పోటీ చేసేందుకు కూడా ఆయన విముఖత చూపించారు. వయోభారం, అనారోగ్యమే కారణంగా ఎన్నికల ప్రచారంలోనూ తాను పాల్గొననని అంబరీష్ స్పష్టం చేశారు. రాజకీయాలకు అంబరీష్ గుడ్బై చెప్పడటంతో చివరి క్షణంలో కాంగ్రెస్ పార్టీ మరో అభ్యర్థిని బరిలోకి దింపింది. పార్టీ పెద్దలు వరుసగా సమావేశమైనా అంబరీష్ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. రాజకీయాలకు గుబ్బై చెబుతూ నిర్ణయం తీసుకున్నారు. అంబరీష్ గత కొద్దిరోజులుగా సిద్ధారామయ్య తీరుపై అసంతృప్తిగా ఉన్నారు. తన బదులు తన భార్య సుమలతకు టికెట్ ఇవ్వాలని కోరినట్లు గత కొన్ని రోజుల క్రితం వార్తలు వచ్చాయి. అయితే సిద్ధారామయ్య అందుకు అంగీకరించలేదని సమాచారం. ఈ పరిణామాలు అంబరీష్లో అసంతృప్తిని పెంచినట్లు సమాచారం.