రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి..

SMTV Desk 2017-07-06 11:31:18  road, bike, accident, medhak

మెదక్, జూలై 6 : ఇంటి నుంచి బయటకు వెళ్తే, మళ్ళీ క్షేమంగా తిరిగి వస్తామన్న నమ్మకం లేదు. డ్రైవర్ల నిర్లక్ష్యం వల్లనో, అతి వేగం వల్లనో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వాళ్ళనే నమ్ముకున్న కుటుంబాలు చెల్లాచెదురైపోతున్నాయి. తాజాగా మరో రోడ్డు ప్రమాదం మెదక్ జిల్లా చేగుంట బైపాస్ రహదారి వద్ద చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... ఈ ఘటనలో ఎదురుగా వస్తున్న బైకును ఓ కారు బలంగా ఢీకొట్టడంతో బైకుపై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మృతి చెందిన వ్యక్తి వివరాలు ఇంకా తెలియరాలేదని వెల్లడించారు.