కన్నడనాట హంగ్‌..!

SMTV Desk 2018-04-24 11:04:56  karnataka elections, karantaka opinion polls, bjp, congress

కర్ణాటక, ఏప్రిల్ 24 : కర్ణాటకలో వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అధికారం తమదంటే.. తమదంటూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. మరో వైపు ప్రాంతీయ పార్టీ అయిన జేడీ(ఎస్‌) కింగ్ మేకర్ పాత్ర పోషించాలని భావిస్తుంది. దీనికి తగ్గట్టు వివిధ సర్వే సంస్థలు సోమవారం ప్రకటించిన ఒపీనియన్‌ పోల్స్‌ మాత్రం హంగ్‌ తప్పదని స్పష్టం చేస్తున్నాయి. టైమ్స్‌ నౌ–వీఎంఆర్‌ చేసిన సర్వేలో అధికార కాంగ్రెస్‌ పార్టీ 91 స్థానాల్లో, బీజేపీ 89 చోట్ల విజయం సాధించే అవకాశాలున్నాయని వెల్లడైంది. గత ఎన్నికల్లో 40 సీట్లు గెలిచిన జేడీఎస్‌ ఈసారి కూడా అదే సంఖ్యలో సీట్లు గెలుచుకుని కీలకంగా మారనుంది. ఏబీపీ–సీఎస్‌డీఎస్‌ సర్వే బీజేపీకి 92, కాంగ్రెస్‌కు 88 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. మొత్తం 224 సీట్లలో అధికారం చేజిక్కించుకునేందుకు కనీసం 113 సీట్లు రావాల్సిందే.