పంజాబ్ పాంచ్ పటాకా..

SMTV Desk 2018-04-24 10:34:11  kings x1 punjab, delhi dare devils, ipl, delhi

న్యూఢిల్లీ, ఏప్రిల్ 24 : ఐపీఎల్-11 సీజన్ లో కింగ్స్ X1 పంజాబ్ జోరు కొనసాగిస్తుంది. సోమవారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్ ఉత్కంఠ పోరులో పంజాబ్ డిల్లీ డేర్‌డెవిల్స్‌ను 4 పరుగుల తేడాతో ఓడించింది. డేర్ డెవిల్స్ జట్టులో శ్రేయస్‌ అయ్యర్‌ (57) కడదాకా పోరాడిన ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. కాగా ఇది పంజాబ్‌కు ఇది వరుసగా నాలుగో విజయం. మొత్తంగా ఐదో విజయంతో ఆ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. గాయం కారణంగా గేల్ ఈ మ్యాచ్ లో ఆడలేదు తొలుత టాస్ నెగ్గిన ఢిల్లీ సారథి గంభీర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ జట్టు ను ప్లంకెట్‌ (3/17), అవేశ్‌ ఖాన్‌ (2/36), బౌల్ట్‌ (2/21) తమ బౌలింగ్ తో కట్టడి చేశారు. కరుణ నాయర్ (34) పరుగులు చేసిన కరుణ్‌ నాయర్‌ టాప్‌ స్కోరర్‌ గా నిలిచాడు. దీంతో పంజాబ్‌ 8 వికెట్లకు 143 పరుగులే చేయగలిగింది. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో ఢిల్లీ చతికిలపడింది. పంజాబ్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 139 పరుగులే చేయగలిగింది. చివరి వరకు శ్రేయస్‌ అయ్యర్‌ ఉన్న జట్టును గెలిపించాలేకపోయాడు. అంకిత్‌ రాజ్‌పుత్‌ (2/23), టై (2/25), ముజీబ్‌ (2/25) పంజాబ్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అంకిత్‌ రాజ్‌పుత్‌ కు దక్కింది.