న్యూఢిల్లీ, ఏప్రిల్ 23 : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురాం రాజన్.. యూకే సెంట్రల్ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ (బీఓఈ)లో కీలక బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. బీఓఈ తదుపరి గవర్నర్ రేసులో రాజన్ పేరు కూడా వినిపిస్తుందని తెలుస్తోంది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ప్రస్తుత గవర్నర్ మార్క్ కార్నే త్వరలో పదవీ విరమణ పొందబోతున్నారు. దీంతో తదుపరి గవర్నర్ కోసం యూకే ప్రభుత్వం కొందరు ప్రముఖ ఆర్థికవేత్తల పేర్లను పరిశీలిస్తోంది. వీరిలో రఘురాం రాజన్ పేరు కూడా వినిపిస్తుంది. మొత్తం ఆరుగురు రేసులో ఉండగా.. ఇందులో రాజన్ ముందంజలో ఉన్నట్లు సమాచారం. అయితే దీనిపై రాజన్కు ఆసక్తి ఉందో లేదో అన్న అంశంపై ఎలాంటి స్పష్టత లేదు. 2013లో రాజన్ ఆర్బీఐ గవర్నర్గా బాధ్యతలు చేపట్టారు. 2016లో ఆయన పదవి కాలం పూర్తయింది.