రేపు తూర్పుగోదావరిలో సీఎం పర్యటన

SMTV Desk 2018-04-23 12:36:40  CM CHANDRABABU NAIDU, tour in east godavari,

కాకినాడ, ఏప్రిల్ 23: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు తూర్పుగోదావరి జిల్లాకు రానున్నారు. ఆయన 24వ తేదీ మంగళవారం ఉదయం 8.45 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరతారు. ఉదయం 9.35 గంటలకు మండపేట మండలం ద్వారపూడిలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 9.45 గంటలకు ఇక్కడ బయలుదేరి ద్వారపూడిలోని సభా ప్రాంతానికి చేరుకుంటారు. ఉదయం 9.50 గంటలకు ఆర్‌వోబీ, ఇతర శిలాఫలకాలను ఆవిష్కరిస్తారు. ఉదయం పది గంటలకు స్టాల్స్‌ను, ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకిస్తారు. ఉదయం 10.10 గంటలకు గ్రామ పంచాయతీ భవనాలు, అంగన్‌వాడీ భవనాలు, సీసీ రోడ్ల శిలాఫలకాలను ఆయన ఆవిష్కరిస్తారు. 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.15 గంటల వరకు జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవం కార్యక్రమంలో పాల్గొంటారు.