జైపూర్, ఏప్రిల్ 23 : అపజయాల సుడిలో ఉన్న రాజస్థాన్ రాయల్స్ జట్టు గెలుపు బాట పట్టింది. ముంబై ఇండియన్స్ తో జైపూర్ వేదికగా జరిగిన ఉత్కంఠ మ్యాచ్ లో మూడు వికెట్ల తేడాతో రాయల్స్ విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ముంబై ఆటగాళ్లలో సూర్యకుమార్ యాదవ్ ( 72), ఇషాన్ కిషన్ (58), అర్ధ సెంచరీలతో రాణించారు. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా అర్చర్ (3/22) కీలక సమయంలో వికెట్లు తీసి ప్రత్యర్థి బోల్తా కొట్టించాడు. ఛేదనలో సంజు శామ్సన్ (52), బెన్ స్టోక్స్ (40)ల భాగస్వామ్యంతో పాటు గౌతమ్ (11 బంతుల్లో 33 నాటౌట్) అనూహ్య ఆటతో రాయల్స్ 19.4 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. ‘జోఫ్రా అర్చర్’ కు మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.